ఆధునిక కాలంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల సమాజంలో డయాబెటిస్ పేషంట్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇంతకు ముందు ఎక్కువగా డయాబెటిస్ అనేది వయస్సు పైబడినవారిలో వచ్చేది. అయితే ప్రస్తుత సమయాల్లో చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు అందుకే మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్గా పిలుస్తారు. మధుమేహం (డయాబెటిస్) అనేది ఒక తీవ్రమైన సమస్య, ఇది ఒక్కసారి వస్తే దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం చేసుకునే వీలుండదు. మధుమేహన్ని సకాలంలో గుర్తించి నియంత్రించుకోకపోతే ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
శరీరం తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించనప్పుడు ఈ డయాబెటిస్ సమస్య వస్తుంది. ప్రపంచంలోనే 7.7 కోట్ల మంది మధుమేహ రోగులతో భారతదేశం రెండో స్థానంలో ఉందంటే ఈ వ్యాధి ప్రభావం ఏ మేర వ్యాపించి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇది మన జీవనశైలిని పూర్తిగా మార్చేస్తుంది. మూడింట ఒక వంతు డయాబెటిస్ పేషంట్లు మూత్రపిండాల వ్యాధిని సైతం ఎదుర్కొంటున్నారు.
ఇందులో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి
డయాబెటిస్ లో జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్) అనే మరో రకం కూడా ఉంటుంది. మహిళలు గర్భం దాల్చిన సమయంలో వచ్చే మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. గర్భంలో ఉన్న శిశువుకు అవసరమైనంత ఇన్సులిన్ను గర్భిణి శరీరం ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య సాధారణంగా 6 నుంచి 16 శాతం మంది గర్భిణుల్లో వచ్చి ప్రసవం తర్వాత తగ్గిపోతుంది.
రోజు మనం తీసుకునే ఆహారం మనకు శక్తికి ప్రధాన వనరు అయిన గ్లూకోజ్ని అందిస్తాయి. అయితే శరీరంలో ఉండే షుగర్ లెవల్స్ ఎప్పుడైతే ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటాయో వారు డయాబెటిస్ని కల్గి ఉన్నారని చెబుతారు. ఈ చక్కెర స్దాయిలను నిర్ధారించడానికి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష చేస్తారు. అంటే, ఉదయం పరగడపున బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ 99 mg/dl లోపు ఉండాలి. అయితే ఈ స్థాయి 100-125 mg/dl చేరితే ప్రీ డయాబెటిస్ అని, 126 mg/dl పైన ఉంటే మధుమేహం (డయాబెటిస్) ఉన్నట్లుగా నిర్దారిస్తారు.
HbA1C లేదా గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అని కూడా పిలువబడే ఈ పరీక్ష ద్వారా కూడా డయాబెటిక్ స్థాయిల గురించి తెలుసుకోవచ్చు. సాధారణంగా HbA1C స్థాయిలు 5.7% లోపు ఉండాలి. అదే HbA1C స్థాయిలు 5.7% నుంచి 6.4% మధ్య ఉంటే దానిని ప్రీ డయాబెటిస్ అనవచ్చు. అదే 6.5% లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలు ఉంటే ఇప్పటికే వారు డయాబెటిస్ ను కలిగి
శరీరం గ్లూకోస్ ను గ్రహించే స్థాయిని కోల్పోవడమే డయాబెటిస్ కు ముఖ్య కారణం.
మధుమేహం వచ్చాక మొదటి 10 సంవత్సరాలు ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో కొందరు అశ్రద్ధ వహిస్తుంటారు. అయితే ఇది శరీరంలోని ఏదో ఒక ఆర్గాన్ మీద చాలా తీవ్రంగా ప్రభావం చూపిన తరువాత తగు పరీక్షలు చేసినప్పుడు మాత్రమే మధుమేహం బారిన పడినట్లు తెలుస్తుంది.
వ్యక్తుల బ్లడ్ షుగర్ ఎంత వరకు పెరిగిందనే దానిపై ఆధారపడి మధుమేహం లక్షణాలు మారుతూ ఉంటాయి.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారంపై కూడా ఎంతో జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది.
కొందరు డయాబెటిస్ నియంత్రణలోకి రాగానే ముందు పాటించిన అలవాట్లను విస్మరిస్తుంటారు. దీంతో వారిలో చక్కెర స్థాయిలు మరింతగా పెరిగి ప్రాణాంతకమైన సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా రక్త పరీక్షలు చేయించుకుంటూ మధుమేహ స్థాయిలు తెలుసుకుంటూ ఉండాలి. సమయానికి సరైన డైట్ పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఈ మధుమేహం బారిన పడకుండా కొంత మేర కాపాడుకోవచ్చు.
About Author –
Dr. Dilip Gude,Senior Consultant Physician, Yashoda Hospital, Hyderabad
MBBS (OSM), DNB, MNAMS (General Medicine), MPH (USA)
దగ్గు, జలుబు మాదిరి సీజనల్గా వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల్లో కళ్లకలక ఒకటి. కళ్లకలక సమస్య స్టాఫిలోకాకల్ బ్యాక్టీరియాల ద్వారా…
థైరాయిడ్ గ్రంథి అనేది మెడ మధ్య స్వరపేటిక క్రింద భాగాన, కాలర్ ఎముక పైన సీతాకోక చిలుకను పోలిన ఆకారంలో…
మన శరీరంలో కాలేయం అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా (రక్తాన్ని…
Hysteroscopy has emerged as a valuable solution to various gynecological issues, offering both diagnostic and…
Endometriosis is a medical condition characterized by the growth of tissue similar to the lining…
పెద్ద ప్రేగు అనేది జీర్ణవ్యవస్థలో ఒక ప్రధాన భాగం. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని…