Yashoda Hospitals > News > దక్షిణ భారతదేశంలో వేగంగా పెరుగుతోన్న“జీర్ణకోశ”(GI) వ్యాధులు: హెచ్చరిస్తున్న గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులు
దక్షిణ భారతదేశంలో వేగంగా పెరుగుతోన్న“జీర్ణకోశ”(GI) వ్యాధులు: హెచ్చరిస్తున్న గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులు

500 మందికిపైగా ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాజిస్టులు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య నిపుణులతో అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానాలపై యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ ప్రారంభం.
హైదరాబాద్, నవంబర్ 1, 2025: యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం ఆధ్వర్యంలో ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, అధునాతన ఎండోస్కోపి వైద్య రంగంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన పురోగాతులపై “యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్సు-2025” పేరుతో రెండు రోజుల పాటు (నవంబర్ 1-2 తేదీలలో) జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ ఈరోజు హోటల్ మరిగోల్ద్ లో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి ప్రారంభించారు.
ఈ అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ లో అన్నవాహిక నుండి దృష్టి సారించి జీర్ణ-ఉదరకోశ, అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్, గ్యాస్ట్రిక్ సమస్యలు, GI క్యాన్సర్ల వరకు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విదానాలు థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ, ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ విధానాల ప్రత్యక్ష ప్రదర్శనలు, అడ్వాన్స్ డ్ ఎండోస్కోపీ రంగంలో ఇటీవలి అందుబాటులోకి వచ్చిన పురోగతిపై అంతర్జాతీయ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులచే లోతైన చర్చలు, ఇంటరాక్టివ్ శిక్షణా సెషన్స్ ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న యువ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు, GI వైద్యులకు వారి ఎండోస్కోపిక్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి హ్యాండ్స్ ఆన్ శిక్షణ కూడా ఈ సదస్సులో అందుబాటులో ఉండడం ఇక్కడి యువ వైద్యులకు ఒక గొప్ప అవకాశమని” యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి సదస్సును ప్రారంభిస్తూ తెలిపారు.
ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. రవి శంకర్ , మాట్లాడుతూ.. “భారతదేశంలో వేగంగా పెరుగుతున్న అనారోగ్య సమస్యలలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిసీజ్ (GI) ఒకటి. ముఖ్యంగా యువతలో GI కేసులు వేగంగా పెరగడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. అద్యయనాల ప్రకారం ప్రతి 10 మంది భారతీయులలో 7 మంది ఏదోఒక గ్యాస్ట్రో ప్రాబ్లెమ్ తో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నయన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ లో A నుండి Z వరకు అన్నవాహిక నుండి గ్యాస్ట్రోఇంటెస్టినల్, గ్యాస్ట్రిక్ సమస్యలు, GI క్యాన్సర్ల వరకు అనేక గ్యాస్ట్రో సమస్యలను ఖచ్చితమైన రోగ నిర్ధారణ పద్దతులు, చికిత్సా విదానాలను ఈ సదస్సుకు హాజరైన యువ డాక్టర్లకు (ప్రత్యక్ష) లైవ్ వర్క్ షాప్ ద్వారా వివరించడం జరిగింది. GI చికిత్సలలో ఉన్న వివిధ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంతోపాటు గ్యాస్ట్రో వైద్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జాతీయ వైద్య నిపుణులతో వారి అనుభవాలను పంచుకునే విధంగా ఈ రెండు రోజుల జాతీయ సదస్సు మరియు లైవ్ వర్క్ షాప్ రూపొందిచడం జరిగిందని” డాక్టర్. రవి శంకర్ అన్నారు.
యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్ యూనిట్ హెడ్, డాక్టర్. విజయ్ కుమార్, మాట్లాడుతూ.. “యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్సు” అనేది జీర్ణశయాంతర ఉదరకోశ చికిత్స నిర్వహణలో అత్యాధునిక క్లినికల్ ఆవిష్కరణ. ఈ రెండు రోజుల అంతర్జాతీయ “కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్” లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అధునాతన జీర్ణ-ఉదరకోశ శస్త్రచికిత్స వ్యూహాలు, మల్టీమోడల్ చికిత్స ప్రణాళికపై నిపుణుల నేతృత్వంలోని లైవ్ సెషన్లు యువ సర్జన్లకు ఒక గొప్ప వేదిక అని డాక్టర్. విజయ్ కుమార్ , తెలియజేసారు.
ఈ “యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్సు-2025” అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ లో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు డాక్టర్. రాకేష్ కుమార్ ఆది, డాక్టర్ జి. ఆర్. శ్రీనివాస్ రావు, డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి, యశోద హాస్పిటల్ యూనిట్ హెడ్, డాక్టర్. విజయ్ కుమార్ మరియు ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన 500 మందికి పైగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
For further information, please contact Mr. Sampath on 78930 53355 / 88971 96669
Appointment
WhatsApp
Call
More